- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్ఎమ్ఈ)కు అత్యవసరంగా రూ. కోటి వరకూ రుణాలివ్వనున్నట్టు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ) వెల్లడించింది. ఎటువంటి తాకట్టు లేకుండా ఎస్ఐడీబీఐ ఈ రుణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారికి రెండు రోజుల్లోగా రుణ మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేసింది. వడ్డీరేటుని కూడా కేవలం 5 శాతమే నిర్ణయించినట్టు, సూక్ష్మ, చిన్న మధ్య తర్వా సంస్థలకు రుణ సదుపాయాన్ని రూ. 2 కోట్ల వరకూ పెంచుతున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా వ్యాప్తి అవుతున్న కోవిడ్-19ని నివారించేందుకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు వంటి ఇంకా ఇతర రక్షణ వస్తువుల తయారీ కోసం ఈ రుణాలను ఇస్తున్నట్టు ఎస్ఐడీబీఐ తెలిపింది.
Tags: emergency working capital, Coronavirus, Economy, India, SIDBI