11 ఏళ్ల కనిష్ఠానికి ప్యాసింజర్ వాహన విక్రయాలు

by  |
11 ఏళ్ల కనిష్ఠానికి ప్యాసింజర్ వాహన విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడాది క్రితం మందగమనంతో దెబ్బతిన్న వాహన విక్రయాలు ఈసారి మరింత దారుణంగా పడిపోయాయి. మే తర్వాత కోలుకున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో రికవరీ జరగలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగంలో అమ్మకాలు దారుణ స్థితిలో పతనమవుతాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్(సియామ్) తెలిపింది.

ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 11 ఏళ్ల కనిష్ఠానికి దిగజారుతాయని సియామ్(SIAM) భావిస్తోంది. 2009-10 నాటి కంటే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తోంది. అనేక రంగాల్లో డిమాండ్ లేమి కారణంగా ఇతర రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంది. దీంతో పరిశ్రమ సామర్థ్యం 50-60 శాతం ఉండవచ్చునని సియామ్ పేర్కొంది. గతేడాది జులైతో పోలిస్తే ఈసారి వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. కానీ అమ్మకాలు మాత్రం దిగజారాయి.

టూ-వీలర్ (two wheeler), కమర్షియల్, ప్యాసింజర్, త్రీ-వీలర్ (three wheeler) వాహనాల విక్రయాలు కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల క్షీణించాయి. ఇటీవల కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మొత్తం అమ్మకాలను నమోదు చేయలేకపోయాయి. దీనికితోడు, రికవరీ నెమ్మదిగా ఉందని సియామ్ తెలిపింది.

Next Story

Most Viewed