మహిళా మృతదేహానికి ఎస్సై అంత్యక్రియలు

by  |
మహిళా మృతదేహానికి ఎస్సై అంత్యక్రియలు
X

దిశ, చిట్యాల : నా అనే వారు ముందుకు రాకపోవడంతో కరోనాతో చనిపోయిన ఓ మహిళ మృతదేహానికి ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామ సర్పంచు సాంబలక్ష్మీ, పంచాయతీ సిబ్బంది రవి, రాజు, మారయ్య, సుగుణ, ఆశా వర్కర్ సుమలత సహకారంతో కొవిడ్ నిబంధనల మేరకు పీపీఈ కిట్లు ధరించి ఆఖరి తంతు పూర్తి చేశారు.

వివరాల్లోకివెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన పట్టెం వరలక్ష్మి శనివారం రాత్రి కరోనాతో మృతి చెందింది. ఆరు రోజుల కిందట ఆమెకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. నిన్న అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed