మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై రాసలీలలు!

by  |
Silent World Resorts
X

దిశ, జవహర్ నగర్: బాధ్యతలు మరిచిన ఓ ఎస్ఐ.. బరితేగించి వ్యవహరించాడు. కరోనా సమయంలోనూ విధులకు రాకుండా స్టేషన్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ తో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఓ పోలీస్ అధికారే రాసలీలల్లో మునిగి మరో పోలీస్ కు దొరకడం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది.

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న సైలెంట్ వరల్డ్ రిసార్ట్‌లో మేడ్చల్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్ఐ.. అదే స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ తో అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఐ గతకొంత కాలంగా సదరు కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరు రిసార్ట్స్ లో ఏకాంతంగా గడుపుతున్నారని కీసర పోలీసులకు ముందస్తుగా పక్కా సమాచారం అందింది. వెంటనే రిసార్ట్‌పై పోలీసులు దాడి చేసినట్టు సమాచారం. అనంతరం ఎస్సైతో పాటు ఆ మహిళను పోలీసులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు తరలించారు. రాసలీలల బాగోతంపై సీపీ మహేశ్ భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story