మాస్క్ ఏదని తీవ్రంగా కొట్టిన ఎస్సై.. యువకుడు మృతి!

by  |
మాస్క్ ఏదని తీవ్రంగా కొట్టిన ఎస్సై.. యువకుడు మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఎస్సై తీవ్రంగా కొట్టడంతో అతను చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ లో కిరణ్ అనే యువకుడు మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగింది. కిరణ్ మృతికి ఎస్సై విజయ్ కుమారే కారణమని, అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మాస్క్ ధరించలేదంటూ నిన్న ఎస్సై విజయ్ కుమార్.. మృతుడు కిరణ్ ను తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. దీంతో అతడు ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహంతో ఆస్పత్రి ఎదుటే ఆందోళన చేపట్టారు. కిరణ్ ను కొట్టిన ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed