ఏకాంతాన్నే ఇష్టపడతా: శృతి

by  |
ఏకాంతాన్నే ఇష్టపడతా: శృతి
X

హీరోయిన్, మ్యుజీషియన్ కమ్ సింగర్ అయిన శృతిహాసన్ లాక్‌డౌన్ సమయాన్ని ఒంటరిగానే గడిపింది. దాదాపు మూడు నెలలు కేవలం పెట్ క్లారాతో తప్పితే మరెవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు, కలవలేదు కూడా. ఇక లాక్‌డౌన్ సడలించాక చెల్లెలు అక్షర హాసన్‌తో కలిసి షికారుకెళ్లిన భామ సోమవారం ఓ పని మీద ముంబై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేసింది. అన్ని పర్మిషన్లు తీసుకునే ప్రయాణం చేసినట్లు తెలిపిన శృతి ఇందుకు సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపింది.

లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఉండటం గురించి అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది ఈ గబ్బర్‌సింగ్ హీరోయిన్. ‘నేను ఏకాంతంగా ఉండేందుకే ఇష్టపడతా.. 19 ఏళ్లుగా ఒంటరిగా, కుటుంబానికి దూరంగా జీవించడం అలవాటైపోయింది’ అని తెలిపింది. పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌తో ప్రయోగాలు చేయడంతో అసలు ఒంటరిననే ఫీలింగ్ కలగదని.. నిజానికి దీని వల్లే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని చెప్పింది. కాగా తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా కూడా శృతిని ఇదే విషయంలో పొగిడేసింది. తను ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటుందని ప్రశంసల వర్షం కురిపించింది.

Next Story

Most Viewed