ఇన్‌స్టా స్టోరీ.. తాగిన మత్తులో శ్రియ, నిర్మాత

by  |
ఇన్‌స్టా స్టోరీ.. తాగిన మత్తులో శ్రియ, నిర్మాత
X

హీరోయిన్ శ్రియ శరణ్.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్. బాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపు పొందిన శ్రియ.. రష్యన్ ఆండ్రీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. లాక్‌డౌన్‌లో వీరిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో తెలుపుతూ భారీగానే పోస్టులు కూడా పెట్టారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ అభిమానులు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఓ నిర్మాత పెట్టిన పోస్ట్.. వీరిద్దరి బ్రేకప్‌కు కారణం అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్.. లేటెస్ట్‌గా తన ఇన్‌‌స్టా స్టోరీలో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న తనూజ్, శ్రియపై చేయి వేసి ఉన్నఫొటో పెట్టి.. ‘తాగిన మత్తులో అప్పటి రాత్రులు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పిక్ చాలా వైరల్ అయింది. అసలు ఆయన ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫొటో పోస్ట్ చేశాడని నెటిజన్లు చర్చిస్తుండగా.. జోక్స్, మీమ్స్‌కు కొదవేలేకుండా పోయింది.


Next Story

Most Viewed