మోహన్ లాల్ గెశ్చర్‌కు శ్రద్ద ఫిదా..

by  |
మోహన్ లాల్ గెశ్చర్‌కు శ్రద్ద ఫిదా..
X

దిశ, వెబ్‌డెస్క్: మాలీవుడ్ మెగాస్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ‘ఆరట్టు’ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. బి. ఉన్ని కృష్ణన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పాలక్కడ్‌లో జరుగుతుండగా.. మంగళవారం సెట్స్‌లో జాయిన్ అయినట్లు తెలిపింది హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న శ్రద్ధ.. సెట్‌లో అందరినీ కలిశానని చెప్పింది. ఈ క్రమంలో మోహన్ లాల్ చెప్పిన మొదటి మాట ‘వెల్ కమ్ టు ది ఫ్యామిలీ’ అని, ఈ మాట విన్నాక తన డే మొత్తం హ్యాపీగా గడిచిపోయిందని తెలిపింది.

మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సూపర్ ఎగ్జైట్ అవుతున్న టాలెంటెడ్ శ్రద్ధ.. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. ఐదేళ్ల తర్వాత మాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్న భామ.. కాన్సెప్ట్, కంటెంట్‌తో పాటు ఉన్ని కృష్ణన్ కథ చెప్పిన విధానం ఈ సినిమాకు కమిట్ అయ్యేలా చేసిందని తెలిపింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ‘ఆరట్టు’ రూ.18 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుండగా.. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

కాగా మాధవన్‌తో కలిసి మారా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన శ్రద్ధ.. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రంలో నటించనుంది. దీంతో పాటు సరికొత్తగా ‘కలియుగం’ టైటిల్‌తో వస్తున్న సినిమాలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది.


Next Story

Most Viewed