- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఊరు, వాడ అందరూ కలిసి చేసుకునే పండుగల్లో ‘వినాయక చవితి’ ఒకటి. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. పీవోపీ వినాయకుల వల్ల పర్యావరణానికి కలుషితం కలుగుతుందని అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం కూడా మట్టి ప్రతిమలనే ప్రతిష్టించాలని సూచిస్తూనే ఉంది. ఏటా ఘనంగా నిర్వహించే ఖైరాతాబాద్ గణేశ్ మండపంలో ఈసారి పర్యావరణ హితమైన మట్టి ప్రతిమనే ప్రతిష్టించబోతున్నారు. అయితే..రాబోయే వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్ ’ విగ్రహాలను పెట్టుకోవాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
‘పీవోపీ గణేష్ ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీళ్లన్నీ కలుషితం అవుతున్నాయి . అందుకే ఈ సారి గణేష్ పండుగ జరుపుకునే వాళ్లంతా కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ ప్రతిమలను పెట్టుకోవాలి’ అని ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది.
సాహో భామ.. జంతువులను కాపాడే విషయంలోనూ.. ఎప్పుడూ పలు సూచనలు చేస్తూ ఉంటుంది. వన్య ప్రాణులను కాపాడే విషయంలో.. కఠినమైన చట్టాలను అమలు చేయాలని చెబుతూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శ్రద్ద కపూర్ ప్రస్తుతం రణ్బీర్ కపూర్తో ‘లవ్ రంజన్’ అనే సినిమాలో నటించబోతుంది.