సరికొత్త హంగులతో ప్రసాద్ మల్టీప్లెక్స్.. రేపటి నుంచి షోస్ స్టార్ట్

by  |
సరికొత్త హంగులతో ప్రసాద్ మల్టీప్లెక్స్.. రేపటి నుంచి షోస్ స్టార్ట్
X

దిశ, సినిమా : ప్రసాద్ మల్టీప్లెక్స్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించేందుకు న్యూ స్క్రీన్స్ ముస్తాబైనట్లు తెలిపారు. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే మా ఉద్దేశమన్న ఆయన.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మల్టీప్లెక్స్ కట్టించిన నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయని, టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. రెనోవేషన్ కోసం భారీగా ఖర్చు చేశామని, త్వరలో ఐమాక్స్ తెరను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నాన్నగారు ఎల్వీ ప్రసాద్ దేశంలోనే గొప్ప నిర్మాతగా ఎదిగారని, సినిమానే జీవితంగా బతికారన్న ఆయన.. ఆయన వారసులుగా సినీ పరిశ్రమకు సేవ చేయడం గర్వంగా ఉందన్నారు.


Next Story

Most Viewed