గొర్రెల కాపరి దారుణ హత్య 

by  |
గొర్రెల కాపరి దారుణ హత్య 
X

దిశ, మహబూబ్ నగర్: నాగర్​కర్నూల్​ జిల్లాలో ఓ గొర్రెల కాపరి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బండరాయితో మోది హతమార్చారు. హత్య జరిగిన ప్రాంతంలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. అయితే, తెలిసిన వారే మందు తాగించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

వట్టెం గ్రామానికి చెందిన గొల్ల రాములు(50) గొర్రెల కాస్తూ జీవనం సాగించేవాడు. రోజులాగే మంగళవారం కూడా గొర్రెలను మేపడానికి వెళ్లాడు. చీకటి పడ్డాక కూడా రాములు ఇంటికి తిరిగిరాలేదు. బుధవారం ఉదయం వట్టెం గ్రామ శివారు కల్వకుంట తండా గేటు వద్ద రాములు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు, నీళ్ల బాటిళ్లు లభ్యమయ్యాయి. తెలిసిన వ్యక్తులే మద్యం తాగించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో డాగ్ స్క్వాడ్ టీంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ గాంధీ నాయక్ తెలిపారు.


Next Story

Most Viewed