రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్..

by  |
రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్..
X

దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ టీఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆమె విజయం సాధించారు. కాగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చక్రం తిప్పారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆహ్వనం మేరకు పార్టీలో చేరగా ఆమెకు చైర్ పర్సన్ పదవి లభించింది. కాగా తాజాగా ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.



Next Story

Most Viewed