- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : పండగ వేళ వాహనాలు కొనుగోలు చేసేందకు సిద్ధమైన ప్రజలకు వాహన కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. పలు వాహనాలకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్(టీకేఎం)వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరలు పెరగనున్నట్లు వెల్లడించింది.
ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ధరల పెంపు తప్పనిసరైందని టొయోటా తెలిపింది. దీనితో పాటు టాటా మోటర్స్ కంపెనీ కూడా మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి.
Next Story