హైదరాబాద్ వెళ్లడానికి షోయబ్ మాలిక్‌కు అనుమతి

by  |
హైదరాబాద్ వెళ్లడానికి షోయబ్ మాలిక్‌కు అనుమతి
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మాన్ షోయబ్ మాలిక్ తన భార్య, బిడ్డను కలుసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుమతి ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో అతను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, ఐదు నెలల క్రితం పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మాలిక్ భార్య సానియా మీర్జా, కొడుకు ఇజ్‌హాన్ లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం ఇండియాలో అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి లేకపోవడంతో వాళ్లు పాకిస్తాన్ వెళ్లలేక ఇక్కడే ఉంటున్నారు. ఇక షోయబ్ మాలిక్ జూన్ 28న ఇంగ్లాండ్ వెళ్తే అక్టోబర్ మొదటి వారం వరకు కుటుంబాన్ని కలిసే వీలు లేదు. దీంతో తనకు కొన్ని రోజులు ఇండియా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని పీసీబీ కోరగా గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో రెండు రోజుల్లో షోయబ్ హైదరాబాద్ వచ్చి తన కుటుంబాన్ని కలుసుకుంటాడని సమాచారం. కాగా, 38ఏళ్ల షోయబ్‌ టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం టీ20 జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, టెస్టు, టీ20 జట్టు సభ్యులందరూ ఒకేసారి ఇంగ్లాండ్ వెళ్తున్నారు.



Next Story

Most Viewed