- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతున్నదని, భయకరంమైన హిందూవుగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ అందరినీ మోసం చేస్తున్నారని MLC అభ్యర్థి, శివసేన పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ అన్నారు. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరిట గుళ్ళలో హిందువులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని, ఉచిత దర్శనం కల్పించాల్సిన చోట ప్రత్యేక దర్శనలపేరిట వందల , వేల రూపాయల టిక్కెట్ల పేరిట అక్రమ వసూళ్లు, హుండీలు, పూజలు, అర్చనలు, లడ్డులకూ, వాహనాల పార్కింగ్, లగేజ్ బ్యాగేజీలు భద్రపరిచే లాకర్ రూముల పేరిట , చివరకు తలనీలాలు సమర్పించే చోట కూడా హిందువుల వద్ద టిక్కెట్ల పేరిట భారీగా డబ్బు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కొత్తగా తెలంగాణాలో హిందువులను దోచుకోవడానికి మరో కుట్రకు తెరలేపారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అచ్చంపేట్ నల్లమల్లలో వెలిసిన పుణ్య శైవ క్షేత్రం ఉమా మహేశ్వరం, ఆంజనేయ స్వామీ దేవాలయం మద్దిమడుగు దేవాలయాలకు వెళ్లే రహదారుల్లో అక్రమ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల నుంచి అక్రమంగా టూ వీలర్కు రూ. 30, ఆటోకు రూ.50, కార్కు రూ.60, బస్సుకు రూ.100 ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు అక్రమంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆ అక్రమ వసూళ్లు ఆపాలని శివసేన పార్టీ తరఫున సింకారు శివాజీ భారీ ధర్నా చేపట్టారు. హిందూ దేవాలయాలకు వెళ్లే దారిలో ఈ అక్రమ చెక్ పోస్టులను తొలగించకపోతే భారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.