రోడ్లపై రెచ్చిపోయిన శివసేన కార్యకర్తలు.. వారిపై కర్రలతో దాడి.(వీడియో)

by  |
రోడ్లపై రెచ్చిపోయిన శివసేన కార్యకర్తలు.. వారిపై కర్రలతో దాడి.(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో సోమవారం బంద్‌లో భాగంగా పలు చోట్ల శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. బంద్ విజయవంతం చేసే క్రమంలో థానే నగరంలో ఆటో డ్రైవర్లను శివసేన కార్యకర్తలు కర్రలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపూర్‌ ఖేరిలో ఇటీవ‌ల రైతుల‌పై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసన తెలుపుతూ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శివ‌సేన కార్యక‌ర్తలు రోడ్లపైకి చేతిలో కర్రలు పట్టుకొని వచ్చి థానే నగరంలో రోడ్లపై ఆటో డ్రైవ‌ర్ల మీద వారు దాడులు చేశారు. ఆటో డ్రైవ‌ర్లను శివ‌సేన కార్యక‌ర్తలు క‌ర్రల‌తో కొట్టారు. ఈ క్రమంలో కొందరు ఆటో డ్రైవర్లు వారితో వాగ్వాదానికి దిగారు. బంద్ నేపథ్యంలో మ‌హారాష్ట్రలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.



Next Story

Most Viewed