AAA రిలీజ్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ

by  |
AAA రిలీజ్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ హీరో శింబు, తమన్నా, శ్రేయ హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‘త్రిబుల్ ఏ( AAA)’. కుసుమ ఆర్ట్స్ బ్యానర్‌పై యాళ్ల కీర్తి సారథ్యంలో జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ మూవీకిడైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ యాళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు.

యాక్షన్‌తోపాటు ఫుల్ గ్లామర్ కలబోసిన చిత్రమని, ప్రేక్షకుల ఆదరిస్తారన్న నమ్మకం తమకుందని నిర్మాత తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈచిత్రానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చినట్లు చెప్పారు. సినిమాలోని డైలాగ్స్‌, పాటలు అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయని, అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.



Next Story