పర్యాటక ప్రియులకు గుడ్ న్యూస్

by  |
పర్యాటక ప్రియులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని మూగబోయేలా చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ తీసుకొస్తూ లాక్‌డౌన్ సడలింపులు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనుమతులు కల్పించింది.

ఇక హైదరాబాద్‌ మహానగరంలోని సందర్శక ప్రదేశాలు కూడా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే హైటెక్ సిటీ‌లోని శిల్పారామం అక్బోబర్‌ 2 ఓపెన్ కానుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అనుమతి కల్పించనున్నారు. అటు జూ పార్క్ కూడా అక్బోబర్ 6న తెరుచుకోనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పార్కులు కూడా ఓపెన్ చేసేందుకు అధికారులు నిర్ణయించారు.

Next Story