- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ ఫిట్ బ్యూటీ, యోగా ట్రైనర్ శిల్పా శెట్టి ఒత్తిడి అధిగమించేందుకు అభిమానులకు చిట్కాలు అందించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో తరుచుగా టచ్లో ఉండే హీరోయిన్..లాక్ డౌన్తో ఏడాది కాలంగా ఒత్తిడికి లోనవుతున్నామని..డిప్రెషన్ను అధిగమించేందుకు ఉత్తమ మార్గం యోగా చేయడమే అని తెలిపింది. నౌకాసనం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెప్పింది. ఈ ఆసనం శరీరం ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి దూరం చేస్తుందని సూచించింది.కోర్, హిప్ ఫ్లెక్సర్లను బలోపేతం చేసేందుకు సహాయపడుతుందని, కీళ్లు, కాళ్ల ఫ్లెక్సిబిలిటీని, బలాన్ని మెరుగుపరుస్తుందని తెలిపింది. ఉదర అవయవాలను స్టిమ్యులేట్ చేస్తుందని..జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పింది. అదే సమయంలో శరీర స్థిరత్వాన్ని ఇంప్రూవ్ చేస్తుందని పేర్కొంది. ప్రస్తుతం శిల్పా ప్రియదర్శన్ డైరెక్షన్లో వస్తున్న ‘హంగామా 2’ సినిమా షూటింగ్తో బిజీగా ఉంది. పరేశ్ రావల్, మీజాన్ జఫ్రీ, ప్రణితా సుభాష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మనాలి, హిమాచల్ ప్రదేశ్లో చిత్రీకరణ జరుపుకుంది.