షెర్లిన్‌పై రూ.50 కోట్ల పరువు నష్టం దావా.. లైంగిక వేధింపులే కారణమా?

by  |
Sherlyn Chopra
X

దిశ, సినిమా : శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతులు షెర్లిన్ చోప్రాపై రూ.50కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. ముంబై జుహు పోలీస్ స్టేషన్‌లో రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్న షెర్లిన్.. పరువు నష్టం దావా గురించి శిల్పా అండ్ రాజ్ తరపు న్యాయవాదులు హెచ్చరించినా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు, నకిలీ, పనికిమాలిన ఆరోపణలు చేసిన షెర్లిన్.. కేవలం తమ పరువు తీసేందుకు, దోచుకునేందుకు మాత్రమే ఇలా చేసిందని నోటీసులో న్యాయవాదులు పేర్కొన్నారు. జేఎల్ స్ట్రీమ్ యాప్‌ వ్యవహారాల్లో శిల్పా శెట్టి పాత్ర లేకపోయినా, మీడియా దృష్టిని ఆకర్షించేందుకే అనవసర వివాదాలు సృష్టిస్తుందన్నారు. అందుకే షెర్లిన్‌పై రూ.50 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నామని, భారతీయ న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 14 న షెర్లిన్.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అడల్ట్ ఫిల్మ్స్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుంచి షెర్లిన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇంటర్వ్యూల ద్వారా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిపై ఫైర్ అయ్యింది.


Next Story

Most Viewed