శేఖర్ మాస్టర్ ప్లాస్మా దానం..!

by  |
శేఖర్ మాస్టర్ ప్లాస్మా దానం..!
X

దిశ, వెబ్‎డెస్క్:

కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి ప్లాస్మా దానం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కరోనా చికిత్సలో కీలకంగా మారిన ప్లాస్మా దానంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కరోనాను జయించి ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.

గత నెలలో తనకు కరోనా పాజిటివ్ రాగా, కిమ్స్‎లో చికిత్స తీసుకున్నట్లు శేఖర్ మాస్టర్ వెల్లడించారు. ఇప్పుడు తన శరీరంలో యాంటీ బాడీస్ పెరిగనందున ప్లాస్మాను చేశానని అన్నారు. డాక్టర్ల సమక్షంలో 400 మి.లీ ప్లాస్మాను దానం చేసినట్లు తెలిపారు. తాను దానం చేసిన ప్లాస్మా ద్వారా ఇద్దరు నుంచి ముగ్గురు రక్షించబడతారని స్పష్టం చేశారు.

Next Story