- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్:
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి ప్లాస్మా దానం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కరోనా చికిత్సలో కీలకంగా మారిన ప్లాస్మా దానంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కరోనాను జయించి ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.
గత నెలలో తనకు కరోనా పాజిటివ్ రాగా, కిమ్స్లో చికిత్స తీసుకున్నట్లు శేఖర్ మాస్టర్ వెల్లడించారు. ఇప్పుడు తన శరీరంలో యాంటీ బాడీస్ పెరిగనందున ప్లాస్మాను చేశానని అన్నారు. డాక్టర్ల సమక్షంలో 400 మి.లీ ప్లాస్మాను దానం చేసినట్లు తెలిపారు. తాను దానం చేసిన ప్లాస్మా ద్వారా ఇద్దరు నుంచి ముగ్గురు రక్షించబడతారని స్పష్టం చేశారు.