ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలది ప్రధాన పాత్ర : శశాంక్ గోయల్

by  |
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలది ప్రధాన పాత్ర : శశాంక్ గోయల్
X

దిశ, భూపాలపల్లి : ఎన్నికల ప్రక్రియలో ప్రధాన భూమికను పోషించే ఈవీఎంల భద్రత కోసమే ఎలక్షన్ ఈవీఎం గోడౌన్లను నిర్మించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్‌ను ఎలక్షన్ సీఈఓ, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఈవీ ప్యాట్‌ను పోలిన కేకును కట్ చేశారు.

అనతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు హృదయం లాంటివని అన్ని జిల్లాల్లో ఎలక్షన్ ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రత్యేక గోడౌన్ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలలో ఈవీఎం గోడౌన్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 గోడౌన్ల నిర్మాణం చేపట్టగా నేటికి 20 పూర్తయ్యాయని నారాయణపూర్, కామారెడ్డి జిల్లాలలో నిర్మాణ ప్రగతిలో ఉన్నాయని ఈ నెలాఖరులోగా వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. పోలీస్ బందోబస్తుతో ఈవీఎంలను ఈ గోడౌన్లలో భద్రపరిచి భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్మించేందుకు ఉపయోగిస్తామని అన్నారు. ఆగస్టులో జిల్లాలో పర్యటన చేసిన సందర్భంగా ఎలక్షన్ గోడౌన్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించడంతో జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్, అధికార యంత్రాంగం సహకారంతో మూడున్నర నెలలలోనే గోడౌన్ నిర్మాణం పూర్తి చేశారని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్ భూపాలపల్లి, గన్ పూర్ తాసిల్దారు ఇక్బాల్, సతీష్ కుమార్, పంచాయతీరాజ్ ఎఇ తిరుపతి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed