- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్: పార్టీ ఏర్పాటు విషయంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్న వైఎస్ షర్మిల జిల్లాల వారిగా కేడర్ నిర్మాణం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. తెలంగాణాలోని ఉమ్మడి జిల్లాల వారిగా అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 18న కరీంనగర్ జిల్లా కేడర్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 13 నియోజకవర్గాలకు చెందిన వైఎస్ అభిమానులు ఇప్పటికే నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఈ మేరకు వైఎస్ఆర్ ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలుస్తున్న కేడర్ హైదరాబాద్ కు తరలివెల్లేందుకు సమాయాత్తం అవుతోంది. భాస్కర్ రెడ్డితో టచ్ లో ఉంటున్న వైఎస్ షర్మిల జిల్లాలో జరుగుతున్నసమీకరణల గురించి అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో వైఎస్ ఆర్ మృతి కారణంగా మరణించిన కుటుంబాలతో పాటు, వైఎస్ పాదయాత్రలో పాల్గొన్న వారు, ఆయన అభిమాన సంఘ నాయకులు గురువారం జరగనున్న సమావేశానికి హాజరయ్యేందుకు కసరత్తులు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో జిల్లా భౌగోళిక స్వరూపం, నెలకొన్న పరిస్థితులు, రాజకీయ మార్పులు, పార్టీ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా అవసరాలు తదితర విషయాలపై షర్మిల జిల్లా నాయకులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.