- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ నెలలో ఈ పాదయాత్ర ఉండనుంది. గతంలో సీఎం వైఎస్ జగన్ జైల్లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ తరపున షర్మిల పాదయాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పాదయాత్రలో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయనుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో రేవంత్ పాదయాత్రపై ప్రకటన ఉండే అవకాశముంది. ఈ క్రమంలో షర్మిల కూడా పాదయాత్ర చేయనుండటంతో.. తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కే అవకాశముంది.
Next Story