- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖైరతాబాద్ : మేయర్ గారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించండి అంటూ గతి పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వేడుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 7లోని గతి ప్రభుత్వ పాఠశాలను ఆమె అధికారులతో కలిసి సందర్శించారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలో జరుపుకున్న శానిటేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆమె సంతాపం ప్రకటించారు. పాఠశాలను సందర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆయమ్మలుగా పనిచేస్తున్న శాంతాబాయి, హంసమ్మ, లావణ్యలు తాము చాలా కాలం క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నామని, కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమకు కేవలం ఎనిమిది వేల జీతం మాత్రమే వస్తుందని పేదరికంలో మగ్గుతున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారని మేయర్ వారికి హామీ ఇచ్చారు.