టీజీ‌ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పోతుగంటి శంకర్

by  |

దిశ, తుంగతుర్తి: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం (టీజీ‌ఎఫ్) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పొతుగంటి శంకర్ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం. ఈ మేరకు టీజీఎఫ్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు దొడ్ల వెంకట్ శనివారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన రాష్ట్ర కమిటీ ఎలక్షన్‌లో శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ మాట్లాడుతూ.. తన ఎన్నిక సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం పట్టభద్రులు అందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed