మిస్టర్ ఇండియాకు షారుక్ నో

by  |
మిస్టర్ ఇండియాకు షారుక్ నో
X

మిస్టర్ ఇండియా సినిమా సీక్వెల్ రాబోతోంది. జీ స్టూడియోస్ నిర్మాణ సారధ్యంలో రానున్న చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును కూడా రెడీ చేసుకున్న అలీ అబ్బాస్ జాఫర్ చిత్రంలో మొగాంబో పాత్రలో నటించాలని షారుక్ ఖాన్‌ను సంప్రదించారట. మిస్టర్ ఇండియాలో అమ్రిష్ పురి చేసిన ఈ పాత్రకు షారుక్ అయితేనే న్యాయం చేయగలడని అనుకున్నారట. కానీ … అలీ అబ్బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట షారుక్. దీంతో డైరెక్టర్ నిరాశపడినా… షారుక్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అభిమానులు. క్లాసికల్ మూవీ మిస్టర్ ఇండియాను టచ్ చేయకపోతేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షారుక్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఫిల్మ్ చేస్తేనే బాగుంటుందటున్నారు.

కాగా మిస్టర్ ఇండియాలో టైటిల్ రోల్‌కు రణ్‌వీర్ సింగ్ ఆల్ మోస్ట్ కన్‌ఫర్మ్ అయినట్లే అని బాలీవుడ్ టాక్. త్వరలోనే నటీనటుల సెలెక్షన్ పూర్తి చేయనున్నాడట డైరెక్టర్. మరి షారుక్ వద్దనుకున్న మొగాంబో పాత్రను ఎవరు చేస్తారో చూడాలి.


Next Story

Most Viewed