అర్ధరాత్రి దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్

by  |
stolen, Bhupalpally
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న 1000 క్వార్టర్స్‌లో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. సుమారు పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు 1000 క్వార్టర్స్ వద్దకు కార్లలో చేరుకొని, సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన ఆ క్వార్టర్లలోని 11,12,13,14 బ్లాక్‌లో ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో తెల్లవారితే వరలక్ష్మి వ్రతం అని ఓ మహిళ రాత్రి సన్నాహాలు చేస్తోంది. గమనించిన ఓ వ్యక్తి దొంగలు ఇంట్లోకి వెళ్లగానే తలుపులు వేసి దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన దుండగులు వెనుకనుంచి పరారైయ్యారు. విలువైన నగలు, డబ్బులు తీసుకొని పారిపోయారని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.



Next Story

Most Viewed