యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

by  |
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఎదురుగా వస్తున్న ట్రక్కును ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed