హేమంత్ కేసులో కీలక నిందితులు అరెస్టు….

by  |
హేమంత్ కేసులో కీలక నిందితులు అరెస్టు….
X

దిశ, వెబ్‌డెస్క్: హేమంత్ కుమార్ హత్య కేసులో మరి కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అవంతి సోద‌రుడు అశీష్ రెడ్డి తో పాటు సందీప్‌రెడ్డి స‌హా కృష్ణ, బాషా , జగన్ సయ్యద్‌లు ఉన్నారు. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 21కి చేరింది. హత్యకు సంబంధించి కృష్ణతో ఏ1 యుుగంధర్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా హత్య అనంతరం నిందితులకు జగన్, సయ్యద్‌లు సహకారం అందించినట్టు పోలీసులు తెలిపారు. అయితే హేమంత్ హత్య కేసులో సందీప్ రెడ్డి గూడూరు, ఆశీష్ రెడ్డిలకు సంబంధం ఉందని అవంతి గతంలో ఆరోపించింది. కాగా తమకు ప్రాణహాని ఉందని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో అవంతి,హేమంత్ సోదరుడు ఫిర్యాదు చేయనున్నారు.



Next Story

Most Viewed