సేవా భారతి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by  |
సేవా భారతి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: సేవా భారతి ట్రస్ట్​ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట్​లో సేవా భారతి ట్రస్ట్​ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన జీహెచ్​ఎంసీ కార్మికులకు స్వెటర్​ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు స్వెటర్​లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వెటర్ లు పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, సేవా భారతి ట్రస్ట్​ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సేవా భారతి సేవలు సమాజానికి ఎంతగానో అవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ తూము శ్రావణ్​ కుమార్​, సేవా భారతి ట్రస్ట్ చైర్మన్ మూర్తి, ట్రస్ట్​ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed