సోషల్ మీడియాలో మంచు లక్ష్మిపై సెటైర్లు

by  |
సోషల్ మీడియాలో మంచు లక్ష్మిపై సెటైర్లు
X

ట వారసత్వంతో సినిమాల్లో అడుగుపెట్టిన మంచు లక్ష్మి తోటి నటీనటుల కంటే ఎక్కువ పేరేతెచ్చుకుంది. కృష్ణ కుమార్తె మంజుల, నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ, నాగబాబు కుమార్తె నిహారిక తదితరులు సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ మంచు లక్ష్మి అంత పాప్యులర్ కాలేకపోయారు.

మంచు లక్ష్మి పాప్యులర్ కావడానికి ఆమె తెలుగు భాష మాట్లాడే విధానం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అమెరికన్ యాక్సెంట్ తెలుగుతో పాటు తన తండ్రి పెంపకం విధానాన్ని ఆమె వెల్లడించే విధానం కూడా ఆమె పాప్యులారిటీ పెరగడానికి దోహదపడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మోహన్ బాబును చిరంజీవి ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, ఈ దశాబ్దం చాలా పాజిటివ్ గా ప్రారంభమైంది. మీ ఇద్దరి మధ్య స్నేహం గురించి నాకు తెలుసు, మీ మధ్య మనస్పర్థలున్నాయన్న పుకార్లును ఈ ముద్దుతో దూరం చేశారు. అంటూ క్యాప్షన్ జోడించింది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు గతంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలున్నాయని, మళ్లీ కలిసిపోయినట్టున్నారని సంబరపడ్డారు. ఇంతలోనే చిరంజీవి తరువాతి సినిమాలో వీరిద్దరూ మళ్లీ నటిస్తున్నారన్న వార్త ఫిల్మ్ సర్కి్ల్ లో చక్కర్లు కొట్టింది. మరోసారి ‘బిల్లా రంగా’ కాంబినేషన్ కుదిరిందని, ఇద్దరూ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఫోటోవెనుక కథను నెటిజన్లు సులువుగానే అర్థం చేసుకున్నారు.

ఆ ఫోటోలో కురిపించిన ప్రేమంతా సినిమా ప్రమోషన్ కోసమేకదా? అంటూ మంచు లక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. సినిమావాళ్ల ప్రేమలు, మనస్పర్థలు ఇలానే ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. సినిమా అవకాశం రానంతవరకు ఎలాంటి విభేదాలైనా ఉంటాయని, కానీ నటించే అవకాశం వస్తే చాలు అన్నీ సమసిపోతాయని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story

Most Viewed