ఊగిసలాటలో మార్కెట్లు!

by  |
ఊగిసలాటలో మార్కెట్లు!
X

గత వారాంతం నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈ వారం ప్రారంభమూ నష్టాలతోనే మొదలయ్యాయి. దేశీయ టెలికాం కంపెనీలు నేడు సర్దుబాటు చేసిన స్థూల రాబడికి సంబంధించిన ఛార్జీలు చెల్లించనున్నాయనే పరిణామాలు, అంతర్జాతీయంగా కరోనా భయాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 2.53 పాయింట్ల నష్టంతో 41,255 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6.50 పాయింట్లు నష్టపోయి 12,106 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సూచీలన్నీ లాభాల్లోకి, నష్టాల్లోకి కదులుతూ ఊగిసలాటలో ఉన్నాయి. టైటాన్, టాటాస్టీల్, నెస్లె ఇండియా సూచీలు లాభాల్లో కొనసాగుతుండగా ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.



Next Story

Most Viewed