బ్యాంకింగ్ షేర్ల అండతో భారీ లాభాల్లో మార్కెట్లు!

by  |
బ్యాంకింగ్ షేర్ల అండతో భారీ లాభాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో జోరందుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో కుప్పకూలిన తర్వాత సూచీలకు ఐటీ రంగ షేర్లు మద్దతునిస్తున్నాయి. దీంతో వరుసగా మూడో రొజున లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా గురువారం మార్కెట్లకు ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లు అండగా నిలిచాయి. ఉదయం ప్రారంభం నుంచే అధిక లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు తర్వాత ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్ల లాభాల స్వీకరణతో కొంత ఒడిదుడుకులకు లోననప్పటికీ అనంతరం జోరందుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 529.36 పాయింట్లు ఎగసి 46,973 వద్ద ముగియగా, నిఫ్టీ 148.15 పాయింట్లు లాభపడి 13,749 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు బలపడగా, ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు పుంజుకున్నాయి, ఐటీ, మీడియా, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కదలాడగా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, డా.రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకమ విలువ రూ. 73.54 వద్ద ఉంది.



Next Story

Most Viewed