మార్కెట్ల రికార్డులకు బ్యాంకింగ్ మద్దతు

by  |
మార్కెట్ల రికార్డులకు బ్యాంకింగ్ మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠాలతో దూసుకెళ్లాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో మిడ్‌సెషన్ సమయంలో నష్టాలను చూసిన సూచీలు చివరి గంటలో మదుపర్ల కొనుగోళ్ల మద్ధతుతో తన రికార్డుల ర్యాలీని కొనసాగించాయి. ప్రధానంగా ఆర్‌బీఐ మొండి బకాయిల వార్తల నేపథ్యంలో డీలాపడిన బ్యాంకింగ్ రంగంలో అదేస్థాయిలో లాభాల జోరు పుంజుకోవడంతో మార్కెట్లు అధిక లాభాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 247.79 పాయింట్లు ఎగసి 49,517 వద్ద ముగియగా, నిఫ్టీ 78.70 పాయింట్లు లాభపడి 14,563 వద్ద ముగిసింది.

నిఫ్టీలో అత్యధికంగా 5 శాతం వరకు బ్యాంకింగ్ రంగం పుంజుకోగా, మీడియా, రియల్టీ, మెటల్, ఆటో రంగాలు బలపడ్డాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, టైటాన్, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.26 వద్ద ఉంది.


Next Story

Most Viewed