రికార్డు స్థాయిల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by  |
రికార్డు స్థాయిల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ఆల్‌టైమ్ రికార్డుస్థాయిల వద్ద ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు అనంతరం ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో అధిక నష్టాల బాట పట్టిన మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను చేరుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 193.58 పాయింట్లు ఎగసి 53,054 వద్ద ముగియగా, నిఫ్టీ 61.40 పాయింట్లు లాభపడి 15,879 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా ఇండెక్స్ మినహా అన్ని రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా మెటల్ రంగం అధికంగా 2.4 శాతం బలపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను సాధించగా, టైటాన్, మారుతీ సుజుకి, రైలయన్స్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.64 వద్ద ఉంది.



Next Story

Most Viewed