వరుసగా రెండోరోజు నష్టాల్లో సూచీలు!

by  |
వరుసగా రెండోరోజు నష్టాల్లో సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు అటీ, ఫినాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నీరసించాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాపడ్డారు. కీలక రంగాల్లో అమ్మకాల వెల్లువకు తోడు ఆసియా మార్కెట్లలోనూ నష్టాలు ర్యాలీ చేయడం, అదేవిధంగా ఇటీవల భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడుతుండటంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయని నిపుణులు తెలిపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 400.34 పాయింట్లు పతనమై 51,703 వద్ద ముగిసింది. నిఫ్టీ 104.55 పాయింట్లు కోల్పోయి 15,208 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా అధికంగా 2 శాతం వరకు డీలాపడగా, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకోగా, నెస్లె ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, డా రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.72 వద్ద ఉంది.



Next Story

Most Viewed