స్వాతంత్ర్య దినోత్సవంపై మావోయిస్టుల సంచలన లేఖ

by  |
స్వాతంత్ర్య దినోత్సవంపై మావోయిస్టుల సంచలన లేఖ
X

దిశ, భూపాలపల్లి: నిజమైన స్వాతంత్ర్యం కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కండి.. ఆగస్టు 15న జరిగే బూటకపు, ఫాసిస్టు స్వాతంత్ర్య దిన వేడుకలను బహిష్కరించాల్సిందిగా సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. సామ్రాజ్యవాదులు, దళారీ, నిరంకుశ, బడా భూస్వాముల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని ప్రకటన విడుదల చేశారు. ఫాసిస్టు సర్కార్‌కు వ్యతిరేకంగా, ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే ‘మోడీ కుట్రే ‘ ఒక సంవత్సరం పాటు జరిగే “ఆజాదికీ అమృత్ ” అంటూ విమర్శించారు. అందుకే పీడిత వర్గాలు, ప్రత్యేక సామాజిక గ్రూపులు, జాతులు ఫాసిస్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలంటూ ప్రకటనలో స్పష్టం చేశారు.



Next Story

Most Viewed