మంత్రి రాజకీయ భవిష్యత్తు‌పై బ్రహ్మణ ఫ్రంట్ సంచలన వ్యాఖ్యలు

by  |
మంత్రి రాజకీయ భవిష్యత్తు‌పై బ్రహ్మణ ఫ్రంట్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై రాష్ట్రీయ బ్రహ్మణ ఫ్రంట్ నాయకులు కే శివశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం అవినీతికి పాల్పడే వెల్లంపల్లి రాజకీయ భవిష్యత్తు సమాధి కాబోతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వెల్లంపల్లి తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు. దేవాదాయశాఖ మంత్రిగా చేసిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని.. ఇది చరిత్ర చెప్తున్న సత్యమని.. ఎందరో దేవాదాయశాఖ మంత్రులు రాజకీయ మనుగడ లేక కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని మంత్రి వెల్లంపల్లి గుర్తుంచుకోవాలని శివశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణాజిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన అనుచరులు, బంధువులు, స్నేహితులు వందలమందిని వారి సొంత కార్లలో కొండపైకి అమ్మవారి దర్శనానికి పంపి సామాన్య భక్తులను ఇబ్బందులకి గురిచేశారని శివ శర్మ విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి అమ్మవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకమండలి నిర్లక్ష్యం వహించింది. కనీసం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed