ఎట్టకేలకు రేవంత్‌తో భేటీకి ఆ సీనియర్లు సిద్ధం

by  |
ఎట్టకేలకు రేవంత్‌తో భేటీకి ఆ సీనియర్లు సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్​ పీఠం కోసం పోటీ పడిన నేతలు ఒక్కొక్కరుగా కలిసి వస్తున్నారు. నిన్నటిదాకా రేవంత్‌ను​ కలిసేందుకు కూడా ముఖం చాటేసిన నేతలు.. తాజాగా భేటీ అయ్యేందుకు సిద్ధపడ్డారు. మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో సమావేశమవుతున్న రేవంత్​… మాజీ మంత్రి మర్రి శశిధర్​రెడ్డితో సమావేశమయ్యారు. తార్నాకలోని ఆయన నివాసానికి నేరుగా వెళ్లి కలిశారు. అదే విధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో అపాయింట్​మెంట్​ ఫిక్స్​ అయింది. సాయంత్రం టీపీసీసీ మాజీ చీఫ్​, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డిని కలవనున్నారు.

ఇప్పటివరకు వీరంతా రేవంత్​రెడ్డికి సమయం ఇవ్వలేదు. వరుసగా పలువురు నేతల ఇండ్లకు వెళ్లి కలుస్తున్న రేవంత్​రెడ్డి… టీపీసీసీ చీఫ్​ కోసం పోటీపడిన నేతలను సైతం కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఉత్తమ్​, భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్​రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రాజగోపాల్​రెడ్డి వంటి నేతలు సమయం కూడా ఇవ్వలేదు. అందుబాటులో లేమంటూ సమాచారమిచ్చారు. కానీ మంగళవారం పరిణామాలు మారాయి. భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి, ఉత్తమ్​తో వరుసగా భేటీ అయ్యేందుకు సమయం కుదిరింది.

భట్టితో మల్లు రవి భేటీ

మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ ఎంపీ మల్లు రవి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, రేవంత్​కు సహాకరించాలంటూ సూచించారు. దాదాపు గంటపాటు భట్టి విక్రమార్క నివాసంలోనే చర్చించారు. అనంతరం సాయంత్రం రేవంత్​రెడ్డితో భట్టి విక్రమార్క అపాయింట్​మెంట్​ ఖరారైంది.

Also Read

సెన్సేషనల్ న్యూస్ : భట్టితో రేవంత్​ భేటీ.. ఫలించిన రాయబారం

షర్మిల పగటి వేషానికి ఫలితమెంత?

Next Story

Most Viewed