కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ మృతి

by  |
కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ మృతి
X

దిశ, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కోరలు చేస్తోంది. ఇప్పటీకే ఈ కరోనా మహమ్మారి ఎంతోమంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంది. తాజాగా ఇంకో జర్నలిస్ట్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. జర్నలిస్టు మితృలకు ఆర్‌కె గా సుపరిచితుడైన భళ్ళమూడి రామకృష్ణ ఇవాళ ఉదయం కన్ను మూశారు. కరోనా తో సోమవారం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ,ఎన్‌టీవీ, డెక్కన్‌ క్రానికల్‌లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆర్‌కె మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed