గుండె పోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి

by  |
గుండె పోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి
X

దిశ, నిజామాబాద్ రూరల్ : సీనియర్ పాత్రికేయుడు టీ న్యూస్ రిపోర్టర్ లింగం (46) గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం నికాల్ పూర్ గ్రామానికి చెందిన లింగం గత పదిహేను, ఇరవై సంవత్సరాల నుంచి రూరల్ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు సేవలందించారు. టీ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న లింగం.. ఈరోజు ఉదయం అనుకోకుండా గుండెపోటు రావడంతో ఇంట్లోనే మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. జర్నలిస్టు మృతి పట్ల ప్రముఖ రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Next Story

Most Viewed