కరోనాతో సీనియర్ కాంగ్రెస్ నేత మృతి

by  |
కరోనాతో సీనియర్ కాంగ్రెస్ నేత మృతి
X

దిశ, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విలయతాండవం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజూ పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కొందరి పరిస్థితి విషమించి మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి.నరేందర్ యాదవ్ కరోనా వైరస్‌కు బలయ్యారు. కరోనా వల్ల అనారోగ్యానికి గురైన ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మరణించారు. కరోనా వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో ఆయన మరణ వార్త తెలిసిన నాయకులు, అందరూ పార్టీకతీతంగా సంతాపం తెలియజేశారు.

Next Story

Most Viewed