విషాదం.. కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

by  |
విషాదం.. కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా బారినపడి ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు మృత్యువాతపడ్డారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే నరేంద్ర బరాగటా కరోనాతో మృతి చెందారు. వివరాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత నరేంద్ర బరాగటా.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

అనంతరం మరోసారి అస్వస్థకు గురి కావడంతో చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఈరోజు ఉదయం శుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చేతన్ సింగ్ వెల్లడించారు.

Next Story