వంద క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

by  |
వంద క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
X

దిశ, బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రం శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సీఐ నరేందర్ వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన వంద క్వింటాళ్ల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని, బాల్కోండ ఎస్ఐ శ్రీహరికి అప్పగించి, ఇమ్రాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


Next Story

Most Viewed