శంషాబాద్‌లో బంగారం పట్టివేత

by  |
శంషాబాద్‌లో బంగారం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దాదాపు రూ.17.48 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు సూట్‌కేస్‌లో ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతడిపై అనుమానం వచ్చిన అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా, సూట్‌ కేస్ కింది భాగంలో బంగారం అమర్చుకొని తరలిస్తున్నట్టు గర్తించారు. అనంతరం అతని వద్ద 22 క్యారెట్ల స్వచ్ఛమైన 340.16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Next Story