ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు పట్టివేత..

by  |
ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు పట్టివేత..
X

దిశ, హుజూర్‌నగర్ : నేరేడుచర్ల మండలంలోని చిల్లెపల్లిలో మూసీనది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను పట్టుకుని ఆ ట్రాక్టర్లతో పాటు యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు. గురువారం మూసీ నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను హుజూర్‌నగర్ ఐడి పార్టీ పోలీసులు నాగరాజు, అజిత్ రెడ్డి, శంభయ్యలు పట్టుకుని పోలీస్ స్టేషన్ ‌లో అప్పగించారని తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లు గండేపల్లి మండలానికి చెందినవిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.



Next Story

Most Viewed