మళ్లీ పసుపు రంగు జెర్సీలో టీమిండియా?..ఆసక్తికరంగా మారిన వసీమ్ జాఫర్ ట్యీట్

by  |
indian jersey
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో చురుకైన పంచులతో సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా ఉంటాడు. అతను ట్విట్టర్లో ఎలాంటి పంచులు వేస్తాడో అందరికి తెలిసిన విషయమే. అయితే అదే తరహాలో వసీమ్ మళ్లీ తన ట్యిట్టర్ అకౌంట్ కేదికగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ సారి మాత్రం భారత జట్టు జెర్సీ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది మొత్తం పసుపు రంగు జెర్సీ వేసుకున్న జట్లే టైటిల్ విన్నర్లుగా నిలవడంతో భారత జట్టు‌కు కూడా అప్పటి కాలం నాటి పసుపు రంగు జెర్సీని మళ్లీ వేసుకోవడానికి ఇదే సరైన సమయమా ? అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్యీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Next Story

Most Viewed