నిరాడంబరంగా లష్కర్ బోనాలు: తలసాని

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-10 04:25:24  IST  )

<p>దిశ, కంటోన్మెంట్: కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 వ తేదీన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి [&hellip;]</p>

నిరాడంబరంగా లష్కర్ బోనాలు: తలసాని
X

దిశ, కంటోన్మెంట్: కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 వ తేదీన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి దంపతులు అందజేశారు.

Next Story