భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

by  |
భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు
X

యాంకర్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేస్తూ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 వేల పూచీకత్తు, ఇద్దరి షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశింది. ఇదే సమయంలో కేసులో నిందితులుగా ఉండి.. పరారీలో ఉన్న భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరిచింది. ఈ నేపథ్యంలోనే చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న భూమా అఖిల ప్రియ రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దని.. దర్యాప్తు జాప్యం జరిగే అవకాశం ఉందని పోలీసులు ఇదివరకే కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిణామాల మధ్య భూమా అఖిల ప్రియకు గమనార్హం.

Next Story

Most Viewed